Friday, 22 July 2011

ఢిల్లీ ఆంధ్రా ఉద్యోగి రెండు చెంపలు వాయించిన హరీశ్‌రావు

మరోసారి ఏపీ భవన్ వార్తల్లోకి ఎక్కింది. హస్తినలో పార్లమెంటు సమీపాన మరణమృదంగం మోగించిన యాదిడ్డి మృతదేహానికి ఏపీ భవన్‌లో ఎందుకు అవమానం జరిగింది? ఎందుకంటే అది ఆంధ్రవూపదేశ్ భవన్ కాదు.. ఆంధ్రోళ్ల భవన్ కాబట్టి! నిజమే! అది ఆంధ్రవూపదేశ్ భవన్ కాదు.. అచ్చంగా ఆంధ్రోళ్ల భవన్! అక్కడ పని చేసేది ఆంధ్రవూపదేశ్ ఉద్యోగులు కాదు.. ఆంధ్ర ఉద్యోగులే! అక్కడ పని చేస్తున్న వారిలో ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు 46 మంది ఉంటే.. తెలంగాణ ప్రాంత ఉద్యోగులు కేవలం ఇద్దరే! జూన్ 17వ తేదీ సంచికలో ఈ వాస్తవాన్ని నమస్తే తెలంగాణ బయటపెట్టింది. ఏపీ భవన్ కాదు.. ఆంధ్రోళ్ల భవన్ అంటూ కథనాన్ని ప్రచురించింది. తెలంగాణవాదులు విమర్శిస్తున్నట్లుగా.. అక్కడ పని చేసేవాళ్లలో 42 శాతం తెలంగాణవాళ్లు ఉద్యోగులుగా ఉండి ఉంటే.. నిస్సందేహంగా ఓ అమరవీరుడి భౌతికకాయం అవమానాన్ని ఎదుర్కొని ఉండేది కాదు. ఈ నేపథ్యంలోనే ‘ఆంవూధాభవన్’లో ఉద్యోగుల లెక్కల బాగోతాన్ని పునర్మువూదిస్తున్నాం.


(అది దేశ రాజధాని ఢిల్లీలోని ఆంధ్రవూపదేశ్ భవన్! హస్తినలో మన రాష్ట్ర ప్రభుత్వ అధికార కేంద్రం! ఢిల్లీలో రాష్ట్త్ర ప్రభుత్వ కార్యకలాపాలన్నింటికీ ఈ భవనే కేంద్ర బిందువు. మన రాష్ట్ర ప్రతినిధులకు అపాయింట్‌మెంట్ ఇప్పించే దగ్గర నుండి పెండింగ్ పనులను ఫాలోఅప్ చేసేంత వరకు.. విషయమేదైనా ఈ భవనే కీలకం! సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదులను సమన్వయ పరిచే బాధ్యతను సైతం ఈ భవనే మోస్తుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర మంత్రు లు, ఎమ్యెల్యేలు, ఉన్నతాధికారులు ఢిల్లీ కొచ్చినప్పుడు ఇక్కడనే బస చేస్తారు.

కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వంతో జరిపే చర్చలపై రాష్ట్ర ఉన్నతాధికారుల సమీక్ష సమావేశాలు సైతం ఈ భవన్లోనే జరుగుతాయి. దీని నిర్వహణకు రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు ఆరు కోట్లు కేటాయిస్తారు. ఇన్ని విశిష్ఠతలకు నెలవైన ఏపీభవన్‌ను.. మినీ సచివాలయంగా పరిగణిస్తారు. అలాంటి మినీ సచివాలయంలో తెలంగాణ ప్రాంతానికి ఎంత ప్రాతినిథ్యం ఉంది? సమాచార హక్కు చట్టం కింద.. ప్రాంతాలవారీగా ఉన్న ఉద్యోగస్తుల వివరాలను ‘నమస్తే తెలంగాణ’ సేకరిస్తే.. విస్మయం కల్గించే వాస్తవాలు బయపడ్డాయి. తెలంగాణకు హస్తినలో జరుగుతన్న మోసాన్ని కళ్లకు కట్టాయి. ఏపీభవన్‌లో ఉద్యోగం పొందిన తెలంగాణ ప్రాంత ఉద్యోగులు.. కేవలం ఇద్దరు!! ఏపీ భవన్‌లో ప్రస్తుతం దాదాపు 122 మంది రెగ్యులర్ ఉద్యోగస్తులు పని చేస్తున్నారు. మరో 50 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు.

భవనం ఢిల్లీలో ఉన్న దృష్ట్యా నిబంధనలకు లోబడి సుమారు 16% ఉద్యోగాలను ఆ ప్రాంతం వారికి కేటాయించాలి. కానీ రెగ్యులర్ ఉద్యోగస్తుల్లో వారి వాటా ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ వారు రూమ్ బాయ్, ఆఫీస్ బాయ్, మాలి, చౌకీదార్, స్వీపర్, డ్రైవర్ లాంటి నాల్గవ తరగతిఉద్యోగాలకే పరిమితమయ్యారు. మిగిలిన 59 ఉద్యోగాల్లో ఆంధ్రా ప్రాంతం వారు 46 ఉద్యోగాలు దక్కించుకుంటే తెలంగాణకు దక్కినవి కేవలం రెండే. అంటే దేశ రాజధానిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో తెలంగాణవారు ఇద్దరేనన్నమాట! శాతంలో చూస్తే.. మొత్తం ఉద్యోగాల్లో ఆంధ్రా ప్రాంతం వారు 78 శాతమైతే తెలంగాణ ఉద్యోగులు కేవలం 3 శాతం. ఇక మిగిలిన 11 మంది ఉద్యోగులు హైదరాబాదు ప్రాంతం వారని పేర్కొన్నప్పటికీ.. దాదాపుగా వారంతా తెలంగాణేతరులే. ఇక 50 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో తెలంగాణ వారు కనీసం ఒక్కరు కూడా లేరు. ఇదీ ఆంధవూపదేశ్ భవన్ సాక్షిగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం.

జీవో 610 అమలు తీరును కోరుతూ సమాచారం అందించాలని అడిగితే ఉద్యోగుల ఎంపిక రాష్ట్ర రాజధానిలో జరిగినందున స్థానిక నిబంధనలు, జీవో 610 తమ శాఖల్లో వర్తించవని కొన్ని శాఖలు పేర్కొన్నాయి. అంటే జీవో 610 అమలు జరపకుండా ఎంపిక చేస్తే మనకు దక్కేవి బొటాబొటీ ఉద్యోగాలే.
కానీ జీవో 610 వర్తించని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో భిన్న ప్రాంత ప్రజలకు సమాన అవకాశాలను, సదుపాయాలను కల్పించే విధంగా సమ న్యాయ సూత్రాన్ని పాటించాలని రాజ్యంగ నిబంధన 371-డీ (1) పేర్కొంటోంది. ఈ నిబంధన కేవలం మన రాష్ట్రాన్ని ఉద్ధేశించే రాజ్యంగంలో పొందుపరిచారు. ఈ సమ న్యాయ సూత్రం ప్రకారం మొత్తం ఉద్యోగాలలో తెలంగాణకు దాదాపు 40% దక్కాలి.

కానీ ఆంధ్రవూపదేశ్ భవన్‌లో తెలంగాణకు దక్కినవి 3 శాతం ఉద్యోగాలు మాత్రమే. సమ న్యాయ సూత్రాన్ని యథేచ్ఛగా విస్మరిస్తున్నారనడానికి, రాష్ట్ర రాజధాని పేర.. ఉద్యోగుల్లో ఆంధ్ర ప్రాంతీయులను ఎంపిక చేస్తున్నారనడానికి ఏపీభవన్ నియామకాలే నిదర్శనంగా కనిపిస్తున్నాయ. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన అధికార యంత్రాంగంలో తెలంగాణ వారికి ఏ మాత్రం భాగస్వామ్యం లేదని ఈ నియామకాలు వెల్లడిస్తున్నాయి.

ముందు వీళ్ల మీద చర్యతీసుకోండి

ముందు వీళ్ల మీద చర్యతీసుకోండి. తర్వాత హరీశ్‌రావు మీద తీసుకోండి
(తెలంగాణ శ్రీనివాస్‌)

ఎపీ భవన్‌ అధికారులపై దాడులు జరగడం ఇదేం కొత్త కాదు.. సీమాంధ్ర, తెలంగాణద్రోహులు ఏపీ భవన్‌ అధికారులను ఇదివరకు పిచ్చకొట్టుడు కొట్టిన్రు. అప్పుడు ఏ దళిత నేత కేసు పెట్టలేదు. చర్యతీసుకోవాలని అరవలేదు. అమరుడిని అవమానించిన చందర్‌రావును కొడితే కేసులు పెట్టేలని సీమాంధ్ర మీడియా. సీమాంధ్ర నేతలు బట్టలు చింపుకుంటున్నరు. ఎప్పుడు ఎవరు ఎవరిని కొట్టిన్రో చూడండి.

1)1986లో బీసీ వర్గానికి చెందిన ఆనంద రాఘవన్‌ అనే బీసీ అధికారిపై ఎంపీ కావూరి సాంబశివరావు చేయిచేసుకున్నడు.

2)1986లోనే అదే ఆనందరాఘవపై వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దాడి చేసి చెంప పగలగొట్టిండు.

3)1987లో ఎంపీ కే.యం.ఖాన్‌ నాగేశ్వరావ్‌ అనే ఎంప్లాయిపై చెయి చేసుకున్నడు.

4)1988లో అదే నాగేశ్వర్‌రావుపై కాంగ్రెస్‌ నేత మహ్మద్‌ జానీ దాడి చేసిండు.

5)1991లో బాలరాజ్‌ అనే కాంగ్రెస్‌ నాయకుడు మల్లిఖార్జున్‌పై చెయ్యి చేసుకున్నడు.

6)1996లో గఫర్‌ అనే అధికారిపై దానం నాగేందర్‌ రెచ్చిపొయి చితకబాదిండు.

7)దానం దాడికి నిరసనగా ఏపీ భవన్‌ ఉద్యోగుల ఆందోళన చేస్తే.. ప్రభుత్వం వారిపై ఎస్మా ప్రయోగించింది.

8)2010లో ఎస్టీ వర్గానికి చెందిన అసిస్టెంట్‌ కమిషనర్‌ లింగరాజును ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో మహ్మద్‌ జానీ చెప్పుతో కొట్టిండు.

వీళ్లు మనుషులు కాదా? వీళ్ల మీద చర్యతీసుకోరా, వీళ్లపై చర్య తీసుకున్నంకనే మావోళ్ల మీద చర్యతీసుకోవాలి. అయినా కొట్టింది హరీశ్‌ అయితే వినోద్‌, కేటీఆర్‌లపై ఎందుకు కేసుపెట్టించిన్రు. ఈ కేసుల కుట్రలో సీమాంధ్ర నేతలతో పాటు సీమాంధ్రమీడియా హస్తం కూడా ఉంది.