Thursday, 28 July 2011

ఢిల్లీలో ప్రాణత్యాగం చేసిన ఆదిరెడ్డి సూసైడ్‌ నోట్‌



హైదరాబాద్‌ల ట్రైన్‌ ఎక్కేముందు ఎన్నోసార్లు ఆలోచించిన. 17-7-2011 వరకు ఎలాంటి ప్రకటన రాకుంటే..ఢిల్లీ వెళ్లి ప్రాణత్యాగం చేయాలని అనుకున్న. నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్న. ఎందుకో నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మతో మాట్లాడిన. చెల్లెతో మాట్లాడిన. ఇక్కడికి వచ్చేముందు అమ్మను చూసి. అమ్మ చేతివంట కడుపునిండా తిని..అమ్మ ఆశీర్వాదం తీసుకుని వద్దామనుకున్న. కానీ, నా లక్ష్యం కోసం ఎక్కడ వెనకడుగు వేస్తనో అని భయపడి పోలేదు. నేను హైదరాబాద్‌ల రైలెక్కేసరికి ఏమీ అర్ధం కాలేదు. నా ప్రాంతాన్ని వదిలిపోతున్నా. నేను ఎన్నో కలలు కన్న తెలంగాణను వీడిపోతున్నా. ఇదొక్కటే చాలా బాధ కలిగింది. అయినా సరే.. తెలంగాణ విముక్తి కోసం ఉద్యమంలో ఒక బిందువునవుత. ప్రధానమంత్రి గారూ నా శవాన్ని ఒక్కసారి చూడండి. జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులారా.. దయచేసి నా చావుగురించి రాయండి. ఓ కెమెరామెన్‌ మిత్రులారా..ఒక్కసారి నా తెలంగాణవైపు మీ కెమెరాల్ని తిప్పండి!

0 comments:

Post a Comment